Supreme Court | ఎమ్మెల్యేలకు ఎర కేసులో స్టే, స్టేటస్ కో ఇచ్చేందుకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం నిరాకరించింది. ఫిబ్రవరి 17న కేసు విచారణ చేపడతామని ఆరోజే అన్ని అంశాలనూ పరిశీలిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే కేసులో మెరిట్స్ ఉంటే ఇచ్చిన డాక్యుమెంట్లను వెనక్కి ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తామని తెలిపింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈనెల 17న విచారణ జరగనుంది. ఈనేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని లేదా స్టేటస్ కో ఇవ్వాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. ఫైల్ సీబీఐ దగ్గరికి వెళ్తే పిటిషన్ నీరుగారిపోతుందని తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ ఇవ్వాలన్న ఒత్తిడి ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీజేఐ స్టే, స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించారు.
కేసు తీవ్రత దృష్ట్యా 17వ తేదీ కంటే ముందే విచారణ చేపట్టాలని సిద్ధార్థ కోరగా.. అదే రోజు విచారణ చేపడతామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు హైకోర్టులోనూ దీనిపై విచారణ చేపట్టింది. తీర్పు ఆపాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై విచారణ జరిపేందుకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నిరాకరించారు. సుప్రీంకోర్టు మాత్రమే దీనిపై సమీక్ష చేస్తుందని స్పష్టం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Prabhas | ప్రభాస్కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్
Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ
Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా
Bhanupriya | మెమొరీ లాస్తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట
Sundeep Kishan | రెజీనాతో డేటింగ్పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్