Breaking News | టైం2న్యూస్, హైదరాబాద్: కూకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారి కుప్పకూలింది. బీజేపీ కార్యాలయానికి సమీపంలో నాలుగు అంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. మూడు అంతస్థులు పూర్తి కాగా నాలుగో అంతస్థు నిర్మిస్తున్నారు. అయితే నాలుగో అంతస్థు శ్లాబ్ నిర్మాణంలో ఉండగానే ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.
గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయకచర్యలు చేపట్టారు.
Read More Articles:
Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే