Breaking News | వాయువ్య డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (డీఆర్సీ)లో ఘోర ప్రమాదం జరిగింది. లులోంగా నదిలో 200 మందితో వెళ్తున్న పడవ నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 145 మంది జలసమాధి అయినట్లు అధికారులు వెల్లడించారు.
మంగళవారం అర్ధరాత్రి సమయంలో రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళ్తుండగా పడవలో 200 మంది వరకు ప్రయాణికులు ఎక్కారు. వీరంతా తమ వస్తువులు, పశువులతో కాంగోకు వలస వెళ్లేందుకు పడవ ఎక్కారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో పాటు పశువులు, వస్తువులు కూడా ఉండటంతో ఓవర్లోడ్ అయిన పడవ నీటిలో మునిగిపోయింది. బసన్కుసు పట్టణం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది 55 మందిని రక్షించారు. మిగతా 145 మంది నీటిలో గల్లంతయ్యారని.. వారంతా మరణించి ఉంటారని అధికారులు వెల్లడించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Priya Bhavani Shankar | డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా.. అయితే ఏంటి.. మీడియాపై హీరోయిన్ విసుర్లు
Rashmika Mandanna | డైరెక్టర్ దెబ్బకు దిగొచ్చిన రష్మిక.. వాళ్ల వల్లే ఇక్కడ ఉన్నానంటూ పొగడ్తలు
Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్మెంట్
Quelea Birds | బుల్లి పిట్టలపై కెన్యా యుద్ధం.. ఆరు లక్షల పక్షులను చంపడమే టార్గెట్