BL Santhosh | తెలంగాణలో ఎమ్మెల్యేల ఎర కేసు విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఆరోపణలు చేసినవాళ్లు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటివరకు తన పేరు తెలంగాణలో ఎవరికీ తెలియదని, తన పేరును ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపంగా మారారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సంపదనంతా రాజకీయాల కోసం దేశమంతా పంచుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ నేతలు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు.
మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని ఓ రిసార్ట్లో జరుగుతున్న బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి, విస్తారక్, పాలక్, కన్వీనర్ల భేటీలో పాల్గొన్న బీఎల్ సంతోష్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తొలిసారి స్పందించారు. తనపై ఆరోపణలు చేసినవారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు జాతీయ నాయకత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Read More Articles |
TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు
Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..
Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన