Home News AP Manchu Lakshmi | రక్తం మరుగుతుందంటున్న మంచు లక్ష్మి!

Manchu Lakshmi | రక్తం మరుగుతుందంటున్న మంచు లక్ష్మి!

Manchu Lakshmi | సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల్ని చూస్తే కోపం కట్టలు తెంచుకుంటుంది. మహిళల పట్ల క్రూరంగా, అమానవీయంగా ప్రవర్తించే వ్యక్తులను చూస్తుంటే.. వాళ్లను కొట్టి చంపేయాలన్న కోపం చాలా మందికి వస్తుంది. ఇప్పుడు అదే ఆలోచనలో తానూ ఉన్నానంటున్నారు మంచు లక్ష్మి. ”రక్తం మరిగిపోతోంది ” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో.

ఆడవారికి రక్షణగా ఉండాల్సిన ఓ పోలీస్‌ అధికారే… అర్ధరాత్రి ఒక యువతి పాలిట రాక్షసుడిలా మారాడు. రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తోన్న యువతిని ఆపడమే కాకుండా.. ఆమె పట్ల చాలా నీచంగా ప్రవర్తించి, తాకరాని చోటల్లా టచ్ చేశాడు. ఇదంతా కూడా బైక్‌ మీద కూర్చొనే చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. పోలీస్ అధికారి నిర్వాకాన్ని దగ్గరలో ఉన్న ఎవరో ఒక వ్యక్తి కెమెరాలో బంధించారు.

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భోపాల్‌లోని హనుమాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ వైరల్ వీడియోను భారత సంతతికి చెందిన స్వీడన్ ప్రొఫెసర్ అశోక్ స్వైన్ ట్వీట్ చేశారు. ‘మహిళకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా ఇండియా ఎందుకు అయ్యింది? ఆఖరికి పోలీస్ కూడా మధ్యప్రదేశ్‌లోని ఒక వీధిలో మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు’ అని అశోక్ స్వైన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

నిజానికి రెండు వర్గాల మధ్య జరిగే ఘర్షణలు, లైంగిక వేధింపుల ఘటనలకు సంబంధించి వీడియోలను అశోక్ గతంలోనూ ట్వీట్లు చేశారు. ప్రతి ట్వీట్‌లోనూ ఇండియా ఎందుకు ఇలా అయిపోతోందనే అంటుంటారు. ఈయనపై సోషల్ మీడియాలో బోలెడంత నెగిటివిటీ ఉంది. అయితే, అశోక్ ట్వీట్‌కు మంచు లక్ష్మి స్పందించారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ‘రక్తం మరిగిపోతోంది’ అని క్యాప్షన్ పెట్టారు.

వీడియోలో యువతిని పోలీస్ అధికారి వేధించడం చూసి మంచు లక్ష్మికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ వీడియో చూసిన ఎవరికైనా కోపం వస్తుంది. అందుకే, మంచు లక్ష్మి ట్వీట్‌కు పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఆ పోలీసు అధికారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Exit mobile version