Pawan Kalyan | శ్రీకాకుళం గొప్పతనానికి గిడుగు రామ్మూర్తి జీవితమే నిదర్శనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీశ్రీ కవిత్వం, రావిశాస్త్రి, చాసో రచనలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు. రణస్థలంలో జనసేన యువశక్తి సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్ర పోరాటగడ్డ అని, కళింగ ఆంధ్ర కాదు.. కలియబడే ఆంధ్ర అని అన్నారు. నేను గెలుస్తానో ఓడుతానో తెలియదు కానీ గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసంటూ వ్యాఖ్యానించారు. తనకు పోరాడటమే తెలుసని తేల్చి చెప్పారు.
పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయానని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నా.. తాను మాత్రం ఏరోజూ బాధపడలేదని అన్నారు. ప్రస్తుతం ప్రజల కోసం.. ప్రజల తరఫున పోరాడుతున్నానని వ్యాఖ్యానించారు. చట్ట సభల్లో పోరాడే సత్తా గత ఎన్నికల్లో ఇవ్వకున్నా.. పోరాటంలో గాయాలుగా భావించానని చెప్పారు. తాను చాలా సుఖాలు చూశానని.. ఇక వాటిపై మమకారం లేదన్నారు. ఇక కడ శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటా.. రణస్థలంలో మాట ఇస్తున్నా అని చెప్పారు.
పార్టీని నడిపేంత డబ్బు వస్తే సినిమాలు వదిలేస్తా
సినిమాలు చేస్తూ రాజకీయాలా ? అని చాలా మంది విమర్శిస్తున్నారని కానీ ఈ దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకులు ఎవరూ లేరని పవన్ కళ్యాణ్ అన్నారు. అందరు రాజకీయ నాయకులు.. వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తూనే రాజకీయాల్లో ఉన్నారని విమర్శించారు. కపిల్ సిబల్, చిదంబరం లాంటి వారే న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ రాజకీయాల్లో ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే తాను కూడా రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నానని తేల్చి చెప్పారు. పార్టీని నడిపేంత డబ్బు వస్తే సినిమాలు వదిలేసేందుక కూడా సిద్ధమేనని ప్రకటించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pawan Kalyan | ఎవడ్రా మనల్ని ఆపేది.. రణస్థలంలో గర్జించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Hyper Aadi | పవన్ కళ్యాణ్కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై హైపర్ ఆది సెటైర్లు
varisu vs thunivu | ఇదేం అరాచకం.. చెన్నైలో థియేటర్ ముందే తన్నుకున్న విజయ్, అజిత్ ఫ్యాన్స్
RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు