AP CM Jagan | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ కృషి చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. పని చేయని ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడిన 30 మంది ఎమ్మెల్యేలపై తాజాగా సీరియస్ అయ్యారు.
ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదికను సోమవారం చేపట్టిన వైసీపీ సమీక్షా సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రదర్శించారు. గడపడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలో పనితీరు సరిగ్గా లేని 30 మంది ఎమ్మెల్యేల పేర్లు సీఎం జగన్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఈ 30 మంది ఎమ్మెల్యేలు తక్కువ రోజుల పాటు తిరిగారని మండిపడ్డారు. దీనిపై గతంలో హెచ్చరించినా.. పనితీరు మార్చుకుని ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం తగదని సూచించారు. ఇప్పటికైనా పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని హెచ్చరించారు. ఈ 30 మంది ఎమ్మెల్యేల్లో గ్రంధి శ్రీనివాస్, సుచరిత, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, ఉదయభాను, కొడాలి నాని , వసంత కృష్ణ ప్రసాద్ పేర్లను సీఎం జగన్ ప్రస్తావించినట్టు సమాచారం.
ఇప్పుడు నిర్వహిస్తున్న గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం తరహాలో ” మా భవిష్యత్ నువ్వే జగన్ ” పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ఈ సమావేశంలో జగన్ నిర్ణయించారు. మార్చి 18 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ నేతలకు వైసీపీ నాయకత్వం సూచించింది. ఎమ్మెల్యేలు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో మా భవిష్యత్తు నువ్వే జగన్ ప్రోగ్రాంపై వివరణ ఇచ్చింది. చేసిన అభివృద్ధిని ప్రతి గడపకూ చేరవేయడమే కార్యక్రమం ప్రధాన అజెండా అని నేతలకు స్పష్టం చేశారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి కొడాలి నాని.. తమ వ్యతిరేక మీడియా అనేక అబద్ధపు సర్వేలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎవరెన్ని చేసినా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని అన్నారు. వైఎస్ జగన్ అంటే ఏమిటో రాబోయే ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు చూడబోతున్నారని అన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!
Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..
Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక