Andhra Pradesh | రాజకీయ పార్టీల రోడ్ షోలు, రహదారులపై సభలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను ఇటీవలే ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటల్లో 11 మంది మరణించారు. దీంతో ఇరుకైన గల్లీలు, రహదారులపై సభలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జీవో ను ప్రస్తావిస్తూ కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో, సభలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని కుప్పంలో చంద్రబాబను అడ్డుకోవటాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. అంతేకాకుండా ఆయన చంద్రబాబుకి మద్దతు తెలిపారు.
కేవలం ప్రతిపక్షాలను అడ్డుకోవడానికి మాత్రమే అధికార ప్రభుత్వం ఈ జీవోని తీసుకుని వచ్చిందని ఆరోపించారు. ఈ జీవోను రద్దు చేసే వరకూ తాము పోరాటం చేస్తామని చంద్రబాబు, పవన్ ప్రకటించారు.
ఈ జీవోపై ఏపీ హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పిల్ దాఖలు చేశారు. రాష్ట్రంలో రహదారులపై సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం రాజకీయ పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 23వ తేదీ వరకు జీవోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీ లోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఈ జీవోను సస్పెండ్ చేయడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది.
ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఈ జీవో విషయంలో టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ఈ జీవో ప్రభుత్వానికి సవాల్ గా మారుతోంది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. అన్ని పరిశీలించిన తర్వాతే.. ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఈ జీవో తీసుకొచ్చామని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పుడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయపరంగా, సాంకేతికంగా వస్తున్న అన్ని రకాల విమర్శలకు ఉన్నత న్యాయ స్థానం ఇవ్వనున్న తీర్పే సమాధానం కానుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pawan kalyan | వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధం.. కమెడియన్ అలీ సెన్సేషనల్ కామెంట్స్
Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్లో పాల్గొన్న పల్లవి జోషి
vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో
Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం