amala paul | టైమ్2న్యూస్, ఎర్నాకుళం : తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా అమలాపాల్ అంటే తెలియనివాళ్లు ఉండరు. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమలాపాల్.. తమిళ, మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల కంటే కూడా ఎక్కువగా వివాదాలతోనే అమలాపాల్ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో కేరళలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. దైవదర్శనానికి అని ఓ గుడికి వెళ్తే ఆలయ అధికారులు అడ్డుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
కేరళలోని ఎర్నాకులం జిల్లా తిరువైరానికుళం మహాదేవ ఆలయానికి సోమవారం అమలాపాల్ వెళ్లింది. కానీ క్రిస్టియన్ కావడంతో ఆమెను ఆలయ అధికారులు అడ్డుకున్నారు. హిందువుకు కాకుండా అన్య మతస్థులు గుడిలోకి అడుగుపెట్టవద్దని సూచించారు. ఆలయ అధికారులు లోపలికి వెళ్లనివ్వకపోవడంతో బయటనుంచే అమ్మవారికి మొక్కుకున్నారు. ఈ ఘటనతో అసహనానికి గురైన అమలా పాల్ విజిటర్స్ రిజిస్టర్లో ఒక నోట్ పెట్టారని కథనాలు వెలువడ్డాయి.
ఆలయంలోకి అనుమతించకపోయినప్పటికీ అమ్మవారి దీవెనలు పొందాను. 2023లో కూడా మత వివక్ష ఉండటం చాలా బాధాకరం. ఇలాంటి మతపరమైన బేధాలు త్వరలోనే దూరమవ్వాలని.. మనుషులందరూ ఒక్కటే అని చెప్పే సమయం రావాలని ఆశిస్తున్నా అంటూ తిరువైరానికుళం మహాదేవ ఆలయంలోని విజిటర్స్ రిజిస్టర్లో రాసుకొచ్చిందని పలు కథనాల్లో ప్రచురితమైంది. ఈ వార్త వైరల్ కావడంతో ఆలయ ట్రస్ట్ కార్యదర్శి స్పందించాడు. ప్రతిరోజూ ఎంతోమంది అన్య మతస్తులు ఇలాగే వస్తుంటారు. కానీ తము మాత్రం ప్రొటోకాల్ పాటించి వాళ్లను అనుమతించమని చెప్పాడు. ఎవరైనా సెలబ్రెటీలు వచ్చినప్పుడు మాత్రం ఇది వివాదాస్పదంగా మారుతుందని పేర్కొన్నాడు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..
Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం
honey rose | సీనియర్ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్ ఛాన్స్