Corona Cases | దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,824 కేసులు నమోదయ్యాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 18,389కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఆరు నెలల కాలంలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
దేశంలో రికవరీ రేటు 98.77 శాతం కాగా, వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 2.24 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు దేశంలో 4.47 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల భారత్ తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కోవిడ్ వ్యాప్తి కట్టడికి చర్యలు ప్రారంభించాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, హరియాణాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 669, దేశ రాజధాని ఢిల్లీలో 400 కేసులు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Costume Krishna | ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ మృతి
IPL 2023 | పంజాబ్ కింగ్స్ శుభారంభం.. వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో కోల్కతా ఓటమి
TSRTC | సామాన్యులకు షాక్.. కేంద్రం నిర్ణయంతో బస్సు ఛార్జీలు పెంచేసిన టీఎస్ఆర్టీసీ
Balagam | ఫస్ట్ మూవీతోనే కమెడియన్ వేణు అదరగొట్టేశాడుగా.. బలగం మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు
IPL 2023 | ఐపీఎల్లో గుజరాత్ శుభారంభం.. 5 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తుచేసిన హర్దిక్ సేన