Shocking Incident | ఉత్తరాఖండ్లో దారుణం జరిగింది. స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా పులి దాడి చేసి ఓ వ్యక్తిని సగం తినేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో రామ్నగర్ అటవీ ప్రాంతంలో జరిగింది. అకస్మాత్తుగా పులి దాడిచేయడంతో స్నేహితులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.
ఖతారి గ్రామానికి చెందిన నఫీస్.. స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు ఊరిబయట కాలువ దగ్గరికి వెళ్లాడు. అక్కడే బ్రిడ్జి పక్కన కూర్చొని మద్యం సేవిస్తున్నారు. ఇంతలో ఊహించని అతిథి వచ్చింది. పార్టీ చేసుకుంటున్న వాళ్లపై దాడి చేసి నఫీస్ను ఎత్తుకెళ్లింది. దీంతో స్నేహితులు ఒక్కసారిగా షాకయ్యారు. భయంతో పరుగులు పెట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు గ్రామస్థుల సహకారంతో చుట్టుపక్కల గాలించారు. అయితే చీకటి పడటంతో వెనక్కి వచ్చేశారు. అయితే యువకులు పార్టీ చేసుకున్న బ్రిడ్జికి 150 కిలోమీటర్ల దూరంలో నఫీస్ మృతదేహం లభ్యమైంది. అయితే నఫీస్ను సగం తిని వదిలేసిందని పోలీసులు గుర్తించారు. ఇది టైగర్ రిజర్వ్ ప్రాంతమని, పులులు సంచరిస్తుంటాయని ఎవరూ అటువైపు వెళ్లొద్దంటూ పోలీసులు ఆదేశించారు.
Read More Articles |
Cherial zptc | సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీపై కత్తులతో దాడి.. వాకింగ్కు వెళ్లొస్తుండగా ఘటన
Cordyceps | భారత్లోకి చైనా సైన్యం చొరబడేది ఆ బంగారం కోసమేనట.. తాజా నివేదికలో సంచలన విషయాలు
Tollywood 2022 | కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సహా 2022లో మరణించిన సెలబ్రెటీలు వీళ్లే