Notice for Taj Mahal | ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్కు నోటీసులు జారీ అయ్యాయి. తాజ్మహల్కు ( Taj Mahal ) నోటీసులేందనుకుంటున్నారా? నిజమే.. ఇంటిపన్ను, నీటి పన్ను బకాయిలు చెల్లించాలంటూ ఆగ్రాలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేశారు. తాజ్మహల్పై 1.4 లక్షల రూపాయల ఇంటి పన్ను, 1.9 కోట్ల రూపాయల నీటి పన్ను బకాయి ఉందని, వెంటనే కట్టాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. 15 రోజుల్లో చెల్లించాలని మున్సిపల్ అధికారులు హుకుం జారీ చేశారు.
గడువులోగా పన్ను చెల్లించకుంటే తాజ్మహల్ను అటాచ్ చేస్తామంటూ తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. నవంబర్ 25న నోటీసులు జారీ చేయగా.. ఇటీవల ఆర్కియాలజీ ఆఫ్ ఇండియాకు అందాయి. ఒక్క తాజ్ మహల్కే కాదు యమునా నదికి ఆనుకుని ఉన్న స్మారక చిహ్నం ఎత్మాద్ ఉద్ దౌలాకు కూడా నోటీసులు జారీ చేశారు.
అయితే మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు రియాక్టయ్యారు. 370 ఏళ్ల చరిత్రంలో తొలిసారి తాజ్మహల్కు నీటి పన్ను, ఇంటి పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయన్నారు. బ్రిటీష్ హయాం నుంచి ఇప్పటివరకు పన్ను కట్టలేదని, ఎప్పుడూ నోటీసులు అందలేదన్నారు. తాజాగా నోటీసులు పంపడం విచిత్రంగా ఉందని ఏఎస్ఐ అధికారి రాజ్ కుమార్ పటేల్ అన్నారు.
జాతీయ స్మారక చిహ్నాలపై ఎలాంటి పన్ను విధించేందుకు వీలుండదని రాజ్ కుమార్ స్పష్టం చేశారు. ఆగ్రాలోని మున్సిపల్ అధికారులు పొరపాటున ఈ పన్ను నోటీసులు పంపి ఉండవచ్చని అన్నారు. తాజ్మహల్కు ఆస్తి పన్ను వర్తించదని, ఇదే విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ చట్టాల్లో ఉందన్నారు. నీరు కూడా వాణిజ్య అవసరాల కోసం వాడటం లేదన్నారు. కేవలం లాన్ల కోసమే వినియోగిస్తున్నందున ఎలాంటి బిల్లు జారీ కాదన్నారు. కాగా, పన్ను వసూళ్ల బాధ్యతలను ఆగ్రాలోని ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారని, పొరపాటున ఇలా నోటీసులు వచ్చి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
Read More Articles |
Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్
Bigg Boss season 7 | బిగ్బాస్ 7 ను బాలయ్య హోస్ట్ చేస్తాడా? నాగార్జున మనసులో ఉన్న హీరో ఎవరు?