Samantha | మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టింది. ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టుల కోసం తనను తాను మార్చుకుంటుంది. ఫిట్గా తయారయ్యేందుకు రకరకాల కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం తెరకెక్కిస్తున్న సిటాడెల్లో పాల్గొంటోంది. ఈ వెబ్ సిరీస్ కోసం సామ్ చాలా కష్టపడుతోంది. భారీ కసరత్తులు చేయడంతో పాటు గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటుంది. మరోవైపు సినిమా షూటింగ్లోనూ పాల్గొంటోంది. ఈ క్రమంలోనే షూటింగ్ సమయంలో సమంత గాయపడింది. ఆమె రెండు చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
రెండు చేతుల నుంచి రక్తం కారుతున్న ఫొటోను సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీ రూపంలో అభిమానులతో పంచుకుంది. యాక్షన్కు ఇదీ ఫలితం అంటూ రాసుకొచ్చింది. సిటాడెల్ షూటింగ్లో భాగంగా ఓ యాక్షన్ సీన్ రిహార్సల్స్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా కూడా సమంత చూపిస్తున్న డెడికేషన్ను చాలామంది మెచ్చుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం సమంత ఆరోగ్యంపై కంగారు పడుతున్నారు. మొన్ననే కాదు ఇమ్యూనిటీ డిజార్డర్ నుంచి కోలుకున్నది.. అప్పుడు రక్తాలు కారేలా కష్టపడటం ఎందుకు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హాలీవుడ్లో సూపర్ హిట్టయిన సిటాడెల్కు ఇండియన్ వర్షన్గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. రాజ్ డీకే దర్శక ద్వయం తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్తో పాటు విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాను ముందుగా కంప్లీట్ చేయాలని భావిస్తోంది. త్వరలోనే ఖుషీ సెట్స్లోకి సామ్ అడుగుపెట్టబోతోంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన ఈ సినిమా వేసవికి వాయిదా పడింది. ఏప్రిల్ 14వ తేదీన శాకుంతలం సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..
Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్ పోస్తా అంటూ జబర్దస్త్ యాంకర్పై సోషల్ మీడియాలో ట్రోల్స్