Posani Krishnamurali | సినీనటుడు, ఏపీ చలన చిత్ర, టీవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తాజాగా కరోనా బారిన పడ్డాడు. ఇప్పటికే రెండు సార్లు కొవిడ్ నుంచి కోలుకున్న పోసానికి.. తాజాగా మూడోసారి కూడా వైరస్ సోకింది. ఓ సినిమా షూటింగ్ కోసం పుణె వెళ్లిన పోసాని.. గురువారం నాడు హైదరాబాద్కు వచ్చాడు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళికి కొవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఆయన్ను హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రెండు మూడు రోజులుగా రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 11,109 మంది కరోనా బారిన పడ్డారు. ఇక నిన్న తెలంగాణలో 45 కరోనా కేసులు నమోదవ్వగా.. అందులో 15 హైదరాబాద్లోనే నిర్ధారణ అవ్వడం గమనార్హం.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Corona Cases | అమ్మో ! కరోనా మళ్లీ రెచ్చిపోతుందిగా.. ఒక్కరోజులోనే అన్ని వేల కేసులా?
GT vs PBKS | హర్దిక్ సేనకు మూడో విజయం.. పంజాబ్ కింగ్స్ను చిత్తుచేసిన గుజరాత్ టైటాన్స్
Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు