Friday, April 19, 2024
- Advertisment -
HomeEntertainmentDil Raju | వారసుడు సినిమాకు విజయ్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ కాదంట.. టాలీవుడ్‌ హీరోలు మిస్‌...

Dil Raju | వారసుడు సినిమాకు విజయ్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ కాదంట.. టాలీవుడ్‌ హీరోలు మిస్‌ చేసుకోవడంతో ఆఫర్‌ పట్టేశాడు

Dil Raju | దిల్‌ రాజు నిర్మాణంలో వస్తున్న వారసుడు ( Vaarasudu ) సినిమా ఇప్పుడు టాలీవుడ్‌, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తళపతి విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మొదట్నుంచి వివాదాలు వెంటాడుతున్నాయి. తెలుగు ప్రొడ్యూసర్‌, తెలుగు దర్శకుడు సినిమా నిర్మిస్తున్నప్పటికీ ఇక్కడ అందరూ దీన్ని తమిళ సినిమాగానే చూస్తున్నారు. అందుకే సంక్రాంతికి భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్‌ చేద్దామనుకుంటే మిగిలిన నిర్మాతలు అడ్డుకుంటున్నారు. సంక్రాంతి సీజన్‌లో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహరెడ్డి వంటి స్టార్ సినిమాలు ఉండగా.. తమిళ సినిమా వారిసు ( Vaarisu )కు ఎక్కువ థియేటర్లు ఎలా కేటాయిస్తారంటూ ఆందోళన చేస్తున్నారు. ఇలా మొదట్నుంచి సినిమా వివాదాల్లోనే ఉంది. ఈ క్రమంలో వారసుడు సినిమాకు తెలుగు హీరోను ఎందుకు ఎంచుకోలేదు అని దిల్‌ రాజుకు మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి విజయ్‌ ఈ సినిమాకు ఫస్ట్‌ ఛాయిస్‌ కాదని.. తెలుగు హీరోలు అందుబాటులో లేకపోవడంతో ఆయనతో సినిమా తీయాల్సి వచ్చిందంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు.

వారసుడు సినిమా కథకు వంశీ పైడిపల్లి ముందుగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబును అనుకున్నాడని బయటపెట్టాడు దిల్‌ రాజు. అప్పటికే మహేశ్‌ బాబు మరో ప్రాజెక్టుతో బిజీగా ఉండటంతో సినిమా కాస్త ఆలస్యమయ్యేలా కనిపించిందని దిల్‌ రాజు తెలిపాడు. మహేశ్‌ ఖాళీ లేకపోవడంతో రామ్‌ చరణ్‌ను కలిసి కథ వినిపించామని చెప్పాడు. కానీ తన బ్యానర్‌లో చెర్రీ, శంకర్‌ కాంబినేషన్‌ సినిమా ఫైనల్‌ కావడంతో వారసుడు సినిమాకు వేరే హీరోను వెతుక్కోవాల్సి వచ్చిందన్నాడు. ఆ సమయంలో ప్రభాస్‌, అల్లు అర్జున్‌ కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని గుర్తు చేశాడు. అందుకే తమిళ హీరో విజయ్‌ని కలిసి కథ చెప్పామన్నాడు. విజయ్‌కి సినిమా కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని.. దీంతో చకచకా సినిమా షూటింగ్‌ మొదలుపెట్టడం, పూర్తి చేయడం జరిగిపోయిందని తెలిపాడు. ఏదేమైనా మహేశ్‌ కోసం అనుకున్న కథ రామ్‌ చరణ్‌ను దాటుకుని చివరకు తమిళ హీరో విజయ్‌ చేతికి వెళ్లింది. ఇప్పుడు ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కోలీవుడ్‌లో చిచ్చురేపిన దిల్‌ రాజు

వారిసు సినిమా విషయంలో దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో చిచ్చురేపుతున్నాయి. ‘ విజయ్‌ నటించిన వారిసు, అజిత్‌ తునివు రెండూ ఒకే రోజు విడుదల అవుతున్నాయి. అందువల్ల తమిళనాడులోని 800 థియేటర్లలో చెరో సగం థియేటర్లు ఇస్తామని చెప్పారు. కానీ విజయ్‌ నంబర్‌వన్‌ హీరోగా కాబట్టి మరో 50 థియేటర్లు అధికంగా ఇవ్వాలని కోరుతున్నా. దీనిపై చెన్నైకి వెళ్లి సీఎం స్టాలిన్‌ను కలుస్తానని’ చెప్పాడు. విజయ్‌ని నంబర్‌వన్‌ హీరో అని దిల్‌ రాజు అనడంపై అజిత్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. నిజానికి అజిత్‌, విజయ్‌ ఫ్యాన్స్‌ మధ్య చాలా రోజులుగా కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఇలాంటి సమయంలో విజయ్‌ను నంబర్‌వన్‌ హీరో అనడంపై దుమారం చెలరేగుతుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Manchu Manoj | భూమా మౌనికతో త్వరలోనే పెళ్లి? మంచు మనోజ్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

Pawan kalyan – Ali | గ్యాప్ రాలేదు.. క్రియేట్ చేశారు.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్‌పై అలీ ఓపెన్ కామెంట్స్

Top 10 south Indian actress | ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికింది ఈ హీరోయిన్‌ గురించే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News