Breaking News | మయోసైటిస్ బారిన పడినట్టు సమంత ప్రకటించినప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై అనేక రకాల వార్తలు వచ్చాయి. మొదట్లో ఇదొక ప్రాణాంతకమైన వ్యాధి అని.. ఇది వస్తే బతకడమే కష్టమని అన్నట్టుగా ప్రచారం చేశారు. దీంతో సామ్ ఫ్యాన్స్ అంతా తెగ ఆందోళన పడిపోయారు. దీంతో నేరుగా సమంతనే మీడియా ముందుకొచ్చి తన వ్యాధి లక్షణాల గురించి వివరించింది. తనకొచ్చింది ప్రాణాంతకమైన వ్యాధి కాదని స్పష్టం చేసింది. అయితే ఏ పని చేద్దామన్నా తొందరగానే అలసిపోతామని చెప్పుకొచ్చింది. ఇలా సమంత ఆరోగ్యం గురించి రోజుకో వార్త పుట్టుకొస్తున్న క్రమంలో ఒక గుడ్ న్యూస్ బయటకొచ్చింది. మయోసైటిస్ నుంచి సమంత పూర్తిగా కోలుకున్నట్టుగా ఓ ఆంగ్ల మీడియాలో కథనం ప్రచురితమైంది.
సమంత తన అనారోగ్యం గురించి ప్రకటించిన తర్వాత రోజుకో వదంతి పుట్టుకొచ్చింది. సామ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. మెరుగైన చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. అంతకుముందు కేరళలో ప్రకృతి వైద్యం తీసుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ వట్టి పుకార్లేనని సమంత సన్నిహితులు కొట్టిపారేశారు. అయినా సమంత గురించి పుకార్లు ఆగలేదు. తన అనారోగ్యం కారణంగా పలు బాలీవుడ్ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్టుగా కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. తాజాగా ఫ్యామిలీమ్యాన్ 2 డైరెక్టర్స్ రాజ్ & డీకే దర్శకత్వంలో వస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్ నుంచి సమంత వైదొలిగినట్టు ఇటీవల బీటౌన్లో వార్తలు జోరందుకున్నాయి. ఇలాంటి సమయంలో సమంత ఆరోగ్యం గురించి ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది.
మయోసైటిస్ నుంచి సమంత పూర్తిగా కోలుకున్నట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. తొందరలోనే ఫుల్ జోష్తో సమంత కెమెరా ముందుకు రాబోతుందని స్పష్టం చేసింది. సమంత సన్నిహితులతో తమ ప్రతినిధులు మాట్లాడిన ఈ విషయం రాబట్టినట్టు ఆ కథనంలో పేర్కొంది. సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నారని వార్త తెలియగానే ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ఇదిలా ఉంటే సమంత ఆరోగ్య పరిస్థితిపై తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా బాలీవుడ్ మీడియా ముందు స్పందించింది. సమంత ఒక అద్భుతమైన మహిళ అని.. తనను ఒక అమ్మలా సంరక్షించుకోవాలని అనుకుంటున్నానని ఎమోషనల్ అయ్యింది.
Read More Articles:
Telangana Congress | టీ కాంగ్రెస్ ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం ఠాగూర్.. త్వరలో కొత్త ఇంఛార్జి
Metro Station | ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వృద్ధురాలు.. స్పాట్లోనే మృతి
Telangana IPS | తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు.. సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రకు అదనపు బాధ్యతలు
Bandi Sanjay | యువతను బీజేపీకి దూరం చేసేందుకే నోటిఫికేషన్లు: బండి సంజయ్