Nayanathara and vignesh shivan | నయనతార, విఘ్నేశ్ శివన్ జంటకు పెళ్లయి ఐదు నెలలు కూడా పూర్తికాకముందే కవల పిల్లలకు అమ్మానాన్నలయ్యారు. పండంటి మగపిల్లలకు ఆదివారం జన్మనిచ్చారు. ఈ ఏడాది జూన్ 9న నయనతార, విఘ్నేశ్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నెల రోజులకు దుబాయ్కి హనీమూన్కి వెళ్లారు. అయితే.. పెళ్లయి నాలుగు నెలలే అయినా.. అప్పుడే కవల పిల్లలు ఎలా అనుకుంటున్నారా?
సరోగసి పద్ధతిలో నయనతార, విఘ్నేశ్ శివన్ అమ్మానాన్నలుగా ప్రమోష న్పొందారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విఘ్నేశ్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ రోజు.. ఈ క్షణం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. నయనతార కూడా ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. తమ జీవితంలో ఇది కొత్త చాప్టర్ అంటూ ఆనందంలో మునిగిపోయాడు.
కవల పిల్లల పాదాలకు ఇద్దరూ ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ విఘ్నేశ్ షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ వార్త విని షాక్కి గురై.. తేరుకున్న అభిమానులు నయన్, విఘ్నేశ్ను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.
Nayan & Me have become Amma & Appa❤️
— Vignesh Shivan (@VigneshShivN) October 9, 2022
We are blessed with
twin baby Boys❤️❤️
All Our prayers,our ancestors’ blessings combined wit all the good manifestations made, have come 2gethr in the form Of 2 blessed babies for us❤️?
Need all ur blessings for our
Uyir?❤️& Ulagam?❤️ pic.twitter.com/G3NWvVTwo9