Samantha | మయోసైటిస్తో బాధపడుతున్నట్టు ప్రకటించినప్పటి నుంచి స్టార్ హీరోయిన్ సమంతపై అందరికీ ఒక సానుభూతి ఏర్పడింది. ఏ చిన్న పని చేసినా కూడా అలసిపోయే ఈ వ్యాధి నుంచి తొందరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్థిస్తున్నారు. సామ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? చికిత్స ఏ విధంగా కొనసాగుతోంది? వంటి విషయాల మీద అంతా ఆసక్తి చూపిస్తున్నారు. సమంత మాత్రం అనారోగ్యం కారణంగా షూటింగ్స్ నుంచి లాంగ్ గ్యాప్ తీసుకుని ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్తో సమంత ముచ్చటించింది. ఇందులో భాగంగానే మయోసైటిస్ తర్వాత తన జీవితం ఎలా మారిందో చెప్పుకొచ్చింది.
ట్విట్టర్లో ఈ ఇంటరాక్షన్ సమయంలో మేడమ్ మీ జీవితం ఎలా సాగుతోందని ఓ అభిమాని ప్రశ్నించగా సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. విభిన్నంగా ఉందని, జీవితం మరోలా ఉందంటూ సమాధానమిచ్చింది. అనంతరం మరో నెటిజన్.. మేడమ్ మీకోసం నేను ప్రార్థిస్తున్నా.. మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రతిరోజు కోరుకుంటున్నా. మళ్లీ మీరు బాక్సాఫీసు వద్ద సక్సెస్లు అందుకోవాలి. మీపై వచ్చే విమర్శలను తిప్పికొట్టాలని కోరాడు. దీనికి సమంత స్పందించింది. మీ ఆశీస్సులు, ప్రార్థనలు నాకెంతో అవసరం అంటూ బదులిచ్చింది. అంతటితో ఆగకుండా ఇంతకీ ఏం విమర్శలు అంటూ ఫన్నీగా బదులిచ్చింది. ఇక శాకుంతలం సినిమా ప్రాజెక్టు అంగీకరించడానికి కారణమేంటని మరో నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి సమాధానం తొందరలో మీకే తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేసుకుంది. ఫిబ్రవరి 17న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు సోమవారం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలం సినిమా తెరకెక్కింది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తుండటం విశేషం.
Read More Articles:
Kajal Aggarwal | అమ్మో.. రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అంత డిమాండ్ చేస్తుందా?
Aadi Saikumar | వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆదికి వరుస ఆఫర్లు ఎలా వస్తున్నాయి?