Sidharth malhotra & Kiara Advani | బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ జైసల్మీర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో రాజరిక సంప్రదాయానికి ఏ మాత్రం తీసిపోకుండా వీరిద్దరి పెళ్లి జరిగింది. రాజస్థాన్ సంప్రదాయం ప్రకారం జరిగిన కియారా – సిద్ధా్ర్థ్ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరికోసం దాదాపు 70 లగ్జరీ కార్లను ఏర్పాటు చేశారు. వచ్చిన అతిథులకు వండి వడ్డించడానికి 500 మంది దాకా వెయిటర్లను ముంబై, ఢిల్లీ నుంచి రప్పించారు. సంగీత్, రిసెప్షన్ కార్యక్రమాలతో మూడు రోజులు అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో ఈ నవ దంపతుల గురించి ఓ విషయం హాట్ టాపిక్గా మారింది.
అదేంటంటే.. రాజస్థాన్ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జంట హనీమూన్కు మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ముందుగా వీరి వివాహ ఆచారాల ప్రకారం పలు పనులు ఉన్నాయి. జైసల్మీర్ నుంచి ఇంటికి వెళ్లాక పంజాబీ, సింధు కుటుంబ ఆచారాల ప్రకారం పలు వేడుకలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇవి అయిపోగానే వీళ్లు కమిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్లు వెయింటింగ్లో ఉన్నాయి.
బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో సిద్దార్థ్ మల్హోత్రా ఓ వెబ్ సిరీస్ కమిట్ అయ్యాడు. ఇండియన్ పోలీస్ ఫోర్స్ పేరుతో వస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయింది. కాబట్టి సిద్ధార్థ్ దీన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఇక కియారా అద్వానీ ఏమో శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఆర్సీ 15లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కియారా కారణంగానే వాయిదా పడింది. కాబట్టి కియారా, సిద్ధార్థ్ ఇద్దరూ కూడా తాము కమిట్ అయిన సినిమాల షూటింగ్ పూర్తయ్యే దాకా తమ హనీమూన్ వాయిదా వేసుకున్నట్లు సమాచారం. కియారా, సిద్ధార్థ్ జంట మాత్రమే కాదు రీసెంట్గా పెళ్లి చేసుకున్న అథియా శెట్టి, కేఎల్ రాహుల్ సైతం తమ హనీమూన్ వేడుకను వాయిదా వేసుకున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Prabhas | ప్రభాస్కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్
Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ
Mekapati chandrashekar Reddy | వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు!