Pooja Hegde | ఈ ఏడాది పూజా హెగ్డేకు అస్సలు కలిసిరాలేదు. ఒకప్పుడు లక్కీ హీరోయిన్గా పేరొందిన పూజాకు ఇప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. దీనికి కారణం ఈ ఏడాది ఆమె నటించిన భారీ ప్రాజెక్టులు అన్నీ ఘోరంగా డిజాస్టర్ అవ్వడమే. భారీ అంచనాలతో వచ్చిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య మూడు సినిమాలు వరుసగా పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో స్టార్ హీరోలు, డైరెక్టర్స్.. పూజా హెగ్డేను బ్యాడ్లక్గా భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సినిమాల పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే పూజా హెగ్డే రెమ్యునరేషన్ పెంచేసిందని మరో ప్రచారం తెరపైకి వచ్చింది. దీనివల్ల ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్తలపై పూజా హెగ్డే స్పందించింది.
వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న పూజా హెగ్డే ఆశలన్నీ ఇప్పుడు బాలీవుడ్లో చేసిన సర్కస్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితేనే తన మీద పడ్డ ఐరన్ లెగ్ ముద్ర కొంతలో కొంతైనా తగ్గుతుంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్లో జోరుగా పాల్గొంటుంది. ఈ క్రమంలో రెమ్యునరేషన్ విషయంలో పట్టు విడవట్లేదని తనపై జరుగుతున్న ప్రచారంపై పూజా హెగ్డే స్పందించింది.
రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చింది. తను రెమ్యునరేషన్ పెంచినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఏ నిర్మాత దగ్గర కూడా అడ్వాన్స్లు తీసుకోలేదని చెప్పింది. కేవలం డబ్బుల కోసమే ఇండస్ట్రీకి వచ్చి ఉంటే ఇప్పటికే చాలా సినిమాలు కమిట్ అయ్యి ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ తను డబ్బుల కోసమే ఇండస్ట్రీకి రాలేదని క్లారిటీ ఇచ్చింది. క్యారెక్టర్ నచ్చితేనే రెమ్యునరేషన్ గురించి ఆలోచిస్తానని.. అంతేతప్ప నాకు ఇంతే పారితోషికం కావాలంటూ నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది.
Read More Articles |
Laththi Review | లాఠీ సినిమా రివ్యూ.. ఈసారైన విశాల్ హిట్ కొట్టాడా?
Kannada actor darshan | తనపై చెప్పు విసరడంపై తొలిసారి స్పందించిన కన్నడ స్టార్ హీరో దర్శన్
Anupama Parameswaran | యాక్టింగ్కు లాంగ్ గ్యాప్ ఇవ్వనున్న అనుపమ.. ఏం చేయబోతుందో తెలుసా