Megastar Chiranjeevi | అవార్డులు అనేవి ఒకరు చేసిన పనిని గుర్తించి వాళ్లకు ప్రోత్సాహకంగా ఇస్తుంటారు. కానీ ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు అవార్డులకి కేవలం తమకు కావలసిన వాళ్లకు ఇచ్చుకునే ఒక ప్రక్రియలా మారిపోయింది అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా అవార్డులపై విమర్శలు ఎన్నో వస్తున్నాయి. తాజాగా మెగా కుటుంబంలో అవార్డులు క్యూ కడుతున్నాయి. అందుకే మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ మధ్య చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 ఇచ్చింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ లో చిరంజీవి ఈ అవార్డు అందుకున్నాడు.
అలాగే రామ్ చరణ్ కూడా ఈ మధ్య ట్రూ లెజెండ్ అవార్డు ఫంక్షన్లో ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు సొంతం చేసుకున్నాడు. ఒకేసారి తండ్రి కొడుకులకు ఈ అవార్డులు రావడంతో మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే చిరంజీవి, చరణ్ కు చాలా తక్కువ గ్యాప్ లో ఇలాంటి ప్రెస్టేజ్ అవార్డుల రావడం వెనక రాజకీయం ఉంది అని ప్రచారం జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జనసేన పనులతో బిజీగా ఉన్నారు. అలాగే సినిమాలు కూడా చేస్తున్నారు. పైగా జనసేనకు బిజెపితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి పోటీ చేస్తారు అని పార్టీ నాయకులు కూడా స్పష్టం చేశారు.
మరోవైపు చిరంజీవి కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ ను ఉన్నత స్థానంలో చూడాలని ఆశ పడుతున్నాడు. ఇలాంటి సమయంలో మెగా కుటుంబంతో బీజేపీకి చాలా పని ఉంది. అందుకే వాళ్లను కాకా పట్టే ప్రక్రియలో భాగంగా వరుసగా అవార్డులు ప్రకటిస్తున్నారు అని ఓవర్గం విమర్శలు చేస్తుంది.
అయితే అలాంటిదేమీ లేదు.. చిరంజీవి, రామ్ చరణ్ ఈ అవార్డులకు అర్హులే అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా కూడా ఒకేసారి రెండు అవార్డులు తండ్రి కొడుకులకు రావడంతో అవార్డ్స్ వెనక పాలిటిక్స్ అంటూ చర్చ మాత్రం జోరుగా జరుగుతుంది.
Read More Articles |
Gurtunda seetakalam Review | గుర్తుందా శీతాకాలం రివ్యూ.. ఒరిజినల్ అంత ఎమోషన్గా సాగిందా?
Haripriya Engagement | కేజీఎఫ్ విలన్తో ఘనంగా హీరోయిన్ ఎంగేజ్మెంట్