Ambani Sisters | అంబానీల పేరు వినగానే ధీరూభాయ్ అంబానీ, అనిల్, ముఖేశ్ అంబానీ పేర్లే గుర్తొస్తాయి. లక్షల కోట్ల వీరి సామ్రాజ్యం గుర్తొస్తుంది. ధీరూభాయ్ అంబానీ ఆస్తులను వందల రేట్లు పెంచి దేశ వ్యాప్తంగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. అందుకే అంబానీల పేర్లు ప్రతిరోజూ వార్తల్లో మారుమోగిపోతుంటాయి. కానీ అంబానీ బ్రదర్స్కు సిస్టర్స్ ఉన్నారని, వాళ్లు కూడా వేల కోట్ల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న విషయాలు తెలుసా?
ధీరూభాయ్ అంబానీకి అనిల్, ముఖేశ్ అంబానీలతో పాటు ఇద్దరు కూతళ్లు ఉన్నారు. వాళ్లే నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్. అయితే ఈ ఇద్దరిలో నీనా కోఠారి రూ. 68 వేల కోట్లకు అధిపతి. కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ కంపెనీ వీళ్లదే. 20 ఏళ్ల క్రితమే జావాగ్రీన్ అనే కాఫీ, ఫుడ్ చైన్ ను కూడా ప్రారంభించారు. నీనా కోఠారిని 1986లో అప్పట్లో ప్రముఖ వ్యాపార వేత్త భద్రశ్యామ్ కొఠారికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు.. అర్జున్ కొఠారి, కుమార్తె నయనతార కొఠారి. అయితే భద్రశ్యామ్ కొఠారి ఏడేళ్ల క్రితం మృతి చెందారు.
అప్పటి నుంచి కుటుంబవ్యాపారాల బాధ్యతలను నీనా కొఠారినే చూసుకుంటున్నారు. కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ కంపెనీ వాల్యూ దాదాపు రూ. 68 వేల కోట్లు. భర్త మృతి చెందిన తర్వాత కంపెనీకి చైర్ పర్సన్గా ఆమె నియమితులయ్యారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Bao missing | మొన్న జాక్మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్.. చైనాలో ఏం జరుగుతోంది?
jackpot | లక్ అంటే ఈ అమ్మాయిదే.. అతి చిన్న వయసులోనే 290 కోట్ల జాక్ పాట్!
EPFO | ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. అధిక పింఛను కావాలంటే ఇలా అప్లై చేసుకోవాలి!