Twist in Women Kidnap Case | ఆధిభట్లలో 100 మంది యువకులు ఓ ఇంటిపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపహరణకు గురైన డాక్టర్ వైశాలి.. తండ్రికి ఫోన్ చేసి మాట్లాడింది. తాను క్షేమంగా ఉన్నానని తెలిపింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. వైశాలి ఫోన్ చేసిన సెల్టవర్ లొకేషన్ ఆధారంగా ఆమె నల్లగొండలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు యువతిని రక్షించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డితో పాటు మరో ముగ్గురు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏం జరిగిందంటే..
ఆదిభట్లలోని మన్నెగూడలో దామోదర్ రెడ్డి, నిర్మల దంపతులు నివాసం ఉంటున్నారు. వారితోనే కుమార్తె డాక్టర్ వైశాలి ఉంటుంది. అయితే శుక్రవారం ఉదయం 100 మంది యువకులతో కలిసి నవీన్ రెడ్డి అనే వ్యక్తి వారి నివాసానికి వచ్చి, దాడి చేసి వైశాలిని ఎత్తుకెళ్లారు. ఇంట్లోని సామాగ్రిని, కార్లను ధ్వంసం చేశారు. నవీన్ రెడ్డిపై గతంలోనే ఫిర్యాదు చేశామని, పోలీసుల అండతోనే నవీన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు వైశాలి తండ్రి ఆరోపించారు. దాడి సమయంలో పోలీసులకు సమాచారం అందించిన సరిగా స్పందించలేదంటూ రోడ్దుపై వైశాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో నవీన్ రెడ్డి టీ స్టాల్కు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
Read More Articles |
CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ
vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?
Hyderabad Metro | మాకూ మెట్రో కావాలి.. హైదరాబాద్ ప్రజలు కొత్త డిమాండ్లు