Karthikeya-2 | ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘కార్తికేయ-2’ ఒకటి. ఎన్నో వాయిదాల తర్వాత ఆగస్టు 12న విడుదలై ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. పోటీగా నితిన్ సినిమా ఉన్నప్పటికి ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై ఘన విజయం సాధించింది. ‘బహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్ ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. ఈ సినిమాతో నిఖిల్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. థియేట్రికల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం రూ.120కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ చిత్రంగా సాధించింది. కాగా ఈ చిత్రం దసరా కానుకగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.
కార్తికేయ-2 చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఈ చిత్రం ఓటీటీలోనూ వండర్స్ క్రియేట్ చేస్తుంది. కేవలం 48 గంటల్లోనే ఈ చిత్రం 100కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇంత తక్కువ టైంలో జీ-5లో ఇన్ని కోట్ల స్ట్రీమింగ్ నిమిషాల వ్యూస్ తో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అడ్వేంచర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. నిఖిల్కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించాడు. కాగా ఈ సినిమా మలయాళ వెర్షన్ సెప్టెంబర్ 23న విడుదల కానుంది. తెలుగులో మీడియం రేంజ్ సినిమాలలో అత్యధిక ప్రాఫిట్స్ వచ్చిన రెండో సినిమాగా కార్తికేయ-2 నిలిచింది. మొదటి స్థానంలో ‘గీతాగోవిందం’ ఉంది.