Adibatla kidnap case | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గోవాలోని కాండోలిమ్ బీచ్లో అదుపులోకి తీసుకున్నట్లు ఆదిభట్ల పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నవీన్ రెడ్డిని గోవా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నవీన్ రెడ్డితో పాటు మరొకరిని మంగళవారం అరెస్టు చేశారు. హుబ్లి, పనాజీ మీదుగా నవీన్ రెడ్డి గోవా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
సినిమా స్ట్లైల్లో ఎంట్రీ ఇచ్చిన దాదాపు 100 మంది యువకులు.. ఆదిభట్లకు చెందిన ముచ్చర్ల దామోదర్ రెడ్డి, నిర్మల ఇంటిపై దాడి చేసి వారి కుమార్తె డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అడ్డువచ్చిన కుటుంబసభ్యులపైనా దాడి చేసి ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని పోలీసులు మొదట్లో భావించారు. కానీ యువతిని కిడ్నాపర్ల బారినుంచి రక్షించిన తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నవీన్ రెడ్డి తనను చిత్ర హింసలకు గురిచేశాడని వైశాలి తెలిపింది. అసలు నవీన్ రెడ్డితో ఎలాంటి స్నేహం లేదని, పెళ్లి చేసుకుంటానని బంధువు ద్వారా సంప్రదిస్తే ఇష్టం లేదని చెప్పినట్లు వైశాలి తెలిపింది. ఫేక్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి ఫోటోలు మార్పింగ్ చేశాడని, బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడని వివరించింది.
Read More Articles |
Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి
TTD EO | తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష.. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు
MLC kavitha | సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. కేంద్రంపై కీలక వ్యాఖ్యలు